మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం `బ్రో`. ఈ మెగా మల్టీస్టారర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తే.. సుముద్రఖని దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు.
తమిళంలో విడుదలైన `వినోదయ సిత్తం` సినిమాను `బ్రో` పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే కథ మరియు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేర్పులు చేశారు. త్రివిక్రమ్ ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్లు మరియు సాంగ్స్ సినిమాపై భారీ హైప్ ను పెంచేశారు. బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరుగుతోంది. ఇకపోతే బ్రో మూవీ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను కంప్లీట్ చేసుకుఇంది. బ్రో మూవీకి సెన్సార్ బోర్డు క్లిన్ యూ సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చింది. ఫ్యాన్స్ కురుకునే స్టఫ్ సినిమాలో పుష్కలంగా ఉందని, పవర్ స్టార్ ఎలివేషన్స్, ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉన్నాయని.. సాయి ధరమ్ తేజ్ మామకు ఏ మాత్రం తగ్గకుండా నటించాడని కొనియాడారట. ఒరిజినల్ తో పోలిస్తే రీమేక్ లో చాలా మార్పులు చేశారని.. అవే సినిమాకు హైలెట్ అయ్యాయని అన్నారట. ఫైనల్ గా బొమ్మ బ్లాక్ బస్టర్ అని రివ్యూ ఇచ్చారట. మరి సెన్సార్ బోర్డ్ సభ్యులను ఆకట్టుకున్న బ్రో సినిమా.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.