మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా `గుంటూరు కారం` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ మూవీ అనంతరం త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నాడు.
ఆల్రెడీ వీరిద్దరి కాంబోలో వచ్చిన జులాయి, అల వైకుంఠపురములో సినిమాలు సూపర్ హిట్ అయ్యాడు. త్రివిక్రమ్-అల్లు అర్జున్ హ్యాట్రిక్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మించనున్నారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కు అల్లు అర్జున్ `పుష్ప` సినిమా పెద్ద తలనొప్పిగా మారింది. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పుష్ప ది రైస్ 2021లో విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం అల్లు అర్జున్ `పుష్ప ది రూల్`తో బిజీగా ఉన్నాడు.
అయితే పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఆయన మార్కెట్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడట. లోకల్ ప్లేవర్ కథ కాకుండా దేశం మొత్తం నచ్చే కాన్సెప్ట్ అయ్యిండాలని చెబుతున్నాడట. ఇదే ఇప్పుడు త్రివిక్రమ్ కు సమస్యగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ను తన కథతో మెప్పించడం కత్తి మీద సాములా మారిందట. ఇప్పటికే త్రివిక్రమ్ రెండు స్టోరీ లైన్స్ వినిపించగా.. వాటిని అల్లు అర్జున్ రిజెక్ట్ చేశాడట. దీంతో త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు కథపై గట్టిగానే కసరత్తు చేస్తున్నాడని అంటున్నాడు.