తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన రకుల్ ప్రీతిసింగ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈ క్రేజీ తోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. హిందీలో మాత్రం ఏడాదికి నాలుగైదు సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది. ముఖ్యంగా నిర్మాత నటుడు జాకీ భగ్నానిని ప్రేమించిన తర్వాత బాలీవుడ్ లోనే తన సమయాన్ని గడిపేస్తోంది. కానీ వివాహ విషయంలో కాస్త వెనకడుగు వేయడంతో పలు రకాలుగా రూమర్లు వినిపించాయి వాటన్నిటికీ ఈ రోజున చెక్ పెట్టినట్టు తెలుస్తోంది రకుల్ ప్రీతిసింగ్.
చాలా రోజులుగా రకుల్ ప్రీతిసింగ్ జాకీ బాగ్నాన్ని కలిసి ఉన్న ఫోటోలు బయటికి రాకపోవడంతో ఇద్దరు విడిపోయారని అనుమానాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వినిపించాయి. అయితే ఈ అనుమానాలను నిజం కాదని ఇద్దరు కలిసే ఉన్నారని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ ఈ వీడియో చూశాక పలు వార్తలు ఫైనల్ గా మారుతున్నాయి. తాజాగా మధు మంతెన వెడ్డింగ్ ఈవెంట్ కి రకుల్ ప్రీతిసింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ బాగ్ని కలిసి హాజరు కావడం జరిగింది..
ఈ వేడుకలు చాలామంది ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.అయితే వీరి జోడి అక్కడ ఆకర్షణీయంగా నిలిచింది వీరి ప్రేమ వివాహాన్ని 2021 వ సంవత్సరంలో తెలియజేయడం జరిగింది అప్పటి నుంచి వీరి పెళ్లి గురించి పలువురు అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు .ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రకుల్ ప్రీతిసింగ్ తమ వివాహాన్ని వాయిదా వేస్తున్నట్టు సమాచారం. మరి ఏడాదైనా పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెబుతారేమో చూడాలి మరి.
View this post on Instagram