సినీ ఇండస్ట్రీలో నెపోటిజం ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. అందుకు తగ్గట్టుగానే సీనియర్ హీరోలు , స్టార్ హీరోలు కూడా తమ వారసులను తమ తదనంతరం ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోని ఎంతోమంది హీరోలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి ఉన్నత హోదా కల్పించగా ఇప్పుడు బాలయ్య కూడా తన కొడుకులు ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.అందులో భాగంగానే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
గతంలో లెజెండ్, గౌతమి పుత్ర శాతకర్ణ వంటి సినిమాలలో మోక్షజ్ఞ నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చినా అది జరగలేదు. ఆ తర్వాత మోక్షజ్ఞ సినిమాలు చేసే అవకాశమే లేదని కూడా వార్తలు వినిపించాయి. మరొకవైపు ఆయన లుక్ పై అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా మోక్షజ్ఞ లుక్స్ అభిమానులను పూర్తిగా సర్ప్రైజ్ చేసేసాయి. పూర్తిగా హీరో మెటీరియల్ గా మారిపోయారు మోక్షజ్ఞ. ఇప్పటికే ఫారిన్లో నటనలో , డాన్స్ మీద ట్రైనింగ్ పూర్తి చేసినట్టు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఆ మధ్య బాలకృష్ణ హింట్ కూడా ఇచ్చారు. మొదటి చిత్రం ఆదిత్య 369 సీక్వెల్ తో రానున్నట్లుగా కూడా తెలిపారు.
దీంతో మోక్షజ్ఞ మొదటి సినిమా బాధ్యత ఏ దర్శకుడికి బాలయ్య అప్పగిస్తారు అన్నది పెద్ద చర్చగా మారింది.. బోయపాటి శ్రీను, క్రిష్ లాంటి వారు రేసులో ఉన్నారని కానీ ప్రస్తుతం బాలకృష్ణ పూరీ జగన్నాథ్ మీద కూడా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాంచరణ్ ను ఇంట్రడ్యూస్ చేసిన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ తొలి సినిమా ఉంటే బాగుంటుందని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఏ మేరకు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం అవుతాడో చూడాలి.