సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూడో సినిమా samb 28 అల వైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయి. ముందుగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాక మహేష్ బాబు ఇంట్లో వరుస విషాదాలతో ఈ సినిమా షూటింగ్ బ్రేక్ పడుతూ వచ్చింది. తర్వాత వాటి నుంచి బయటికి వచ్చి మహేష్ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. దీంతో మహేష్ ఫాన్స్ లో కూడా మంచి జోష్ వచ్చింది.
ఈ సినిమాపై ఎన్నో పుకార్లు షికారులు చేశాయి. వాటిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చిన
ఆవి ఆగలేదు.. ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తున్న వేళ నిర్మాతల నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ విషయంలో ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ రెండు మూడు పేర్లు కూడా బయటకు వచ్చాయి.. ఇక వాటిలో అమరావతికి అటు ఇటు, గుంటూరు కారం, ఊరుకు మొనగాడు అనే ఇలా ఈ మూడు టైటిల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ మూడు టైటిల్స్ లో ఒకటి కన్ఫర్మ్ చేసి ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ను రివిల్ చేస్తారని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇదే సమయంలో త్రివిక్రమ్ తన గత సినిమా అల వైకుంటపురంలో సినిమా టైటిల్ విషయంలో కూడా ఇలాగే తెగ ప్రచారం జరిగింది.
చివరికి బయటకు వచ్చిన టైటిల్ కాకుండా త్రివిక్రమ్ వేరే టైటిల్ని ఫిక్స్ చేశాడు. టైటిల్ విషయంలో వస్తున్న వార్తలను పక్కన పెడితే.. ఇలా ప్రచారం వల్ల సినిమా షూటింగ్ దశలో ఉండగానే కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది. SSMB28 విషయంలో కూడా త్రివిక్రమ్ సేమ్ ఫార్ములాని అప్లై చేశారన్న టాక్ ఫిలిమ్ నగర్ లో జోరుగా వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్ లో మహేష్ బాబు మాస్ లుక్ లో దర్శనం ఇవ్వడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.