ప్రముఖ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `బద్రి` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. తన తొలి సినిమా హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. కొన్నాళ్లు సహజీవనం చేసి ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఆపై ఇద్దరూ పెళ్లి చేసుకుని.. ఒక కూతురును కన్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్నేళ్లకే మనస్పర్థలతో వీరు విడిపోయారు.
విడాకులపై ఎన్నడూ రేణు దేశాయ్ స్పందించలేదు. కానీ, తొలిసారి ఓ సంచలన పోస్ట్ పెట్టింది. అది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి మాట్లాడుతూ.. `సమాజంలో ఇద్దరు విడిపోతోతే ఆడవారికే విమర్శలు వస్తాయి. అంతెందుకు పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ లు విడిపోయినప్పుడు కూడా ఆమెనే బాగా విమర్శించారు. ఒకవేళ తనకు అకీరా పుట్టింది సహజీవనం వల్ల కాదు.. ఏ గుడిలోనో, చర్చిలోనే పవన్ తనను పెండ్లి చేసుకున్నాడు అని రేణూ దేశాయ్ స్టేట్ మెంట్ ఇచ్చినట్టు ఉంటే పవన్ ఈ రోజు జైలుకు వెళ్లేవాడు` అంటూ వ్యాఖ్యానించింది.
ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న రేణు దేశాయ్.. `నాకు ఆవిడ ఎవరో అని తెలీదు. ఆవిడ నా గురించి ఎందుకో మాట్లాడరు నాకు తెలియలేదు. కానీ మొదటి సారి పబ్లిక్ లో ఒకరు తన తరుపున మాట్లాడటం విని నేను చాలా ఏడ్చాను. నేను ఏదైనా చెప్తే ఎదో ఒక పొలిటికల్ పార్టీ కీ అమ్ముడుపోయాను అంటరు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయ్ అంటరు. కానీ, ఈ వీడియో చూశాక నా బాధ అర్ధం చేసుకునే వాళ్లు ఉన్నాను అని ధైర్యం వచ్చింది` అంటూ రాసుకొచ్చింది. దీంతో రేణు పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
https://www.instagram.com/reel/Cq0ElJCBBs0/?utm_source=ig_web_copy_link