పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు 2008లో వచ్చిన జల్సా సినిమా తర్వాత చాలా రోజులు పాటు సరియైన హిట్ అందుకోలేదు.. మధ్యలో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల్లోకి వెళ్లారు. జల్సా తర్వాత ఏకంగా రెండున్నర సంవత్సరాలు పాటు లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత చేసిన కొమరం పులి, పంజా వంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. పవన్ అభిమానులు కూడా బాగా నిరుత్సాహంలో ఉన్నారు.
అలాంటి సమయంలో హరీశంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ అయింది.. పవన్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. గబ్బర్ సింగ్ సినిమా వచ్చిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో టాలీవుడ్ రికార్డులను షెక్ చేశాడు. ఇది పవన్ కళ్యాణ్ సినిమా అని పవన్ అభిమానులు ఎంతో గర్వంగా చెప్పుకునేంత సినిమాగా అత్తారింటికి దారేది నిలిచింది.
పైగా రిలీజ్ ముందు ఈ సినిమాకు ఎన్నో కష్టాలు కూడా వెంటాడాయి. సినిమా ఆన్లైన్లో ముందే లీక్ అయిపోయింది. పవన్ కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. అత్తారింటికి దారేది సినిమా గురించి ఎవ్వరికీ తెలియని షాకింగ్ నిజలు ఇక్కడ చూద్దాం.. ఈ సినిమాలో హంసానందిని “ఇట్స్ టైం టు పార్టీ నౌ“ అనే ఐటమ్ సాంగ్లో స్టెప్పులు వేసింది. అయితే ముందుగా ఈ ఆఫర్ స్టార్ యాంకర్ అనసూయకి వెళ్ళింది. అనసూయ ఈ ఐటెం సాంగ్ ఆఫర్ రిజెక్ట్ చేయడంతో తర్వాత హంసానందిని ఫిక్ చేశారు.
అలాగే ఖుషి సినిమాలో “గజ్జె ఘల్లు మన్నదిరో“ ఐటెం సాంగ్ లో డ్యాన్స్ చేసిన ముంతాజ్ను 12 ఏళ్ల తర్వాత తీసుకువచ్చి మళ్లీ ఈ ఐటెం సాంగ్ లో స్టెప్పులు వేయించారు. ఈ సినిమా కథనం త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్ కు ఫోన్ లో చెప్పారు. కథ విన్న వెంటనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు హీరోగా ముందు విక్టరీ వెంకటేష్ ను అనుకున్నారు. అయితే వెంకటేష్ ఈ క్యారెక్టర్ రిజెక్ట్ చేయడంతో తర్వాత ఈ ఆఫర్ పవన్కు వెళ్ళింది.
ఈ సినిమాలో హీరోయిన్గా ముందు ఇలియానాను అనుకున్నారు. అప్పటికే ఇలియానా- పవన్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జల్సా సినిమాలో నటించింది. అయితే ఇలియానా డేట్లు సర్దుబాటు అవకపోవడంతో ఆ స్థానంలో సమంతను తీసుకున్నారు. సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికైంది. ఈ సినిమాలో కొంత భాగం స్పెయిన్ లో షూట్ చేశారు. స్పైన్ లొకేషన్ లను పవన్ స్వయంగా సెల్ట్ చేశాడు.. అక్కడ 45 రోజులు పాటు షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో నదియా –పవన్ కళ్యాణ్ మధ్య ఉండే సీన్కు పవన్ స్వయంగా దర్శకత్వం వహించారు.`అత్తారింటికి దారేది` సినిమాకు అవార్డుల పంట పండింది.
2013లో ఈ సినిమాకు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. అలాగే ఆరు సైమా అవార్డులు సైతం ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్లకు అప్పట్లో భారీ వ్యూస్తో పాటు లైకుల రావటం టాలీవుడ్ లోనే సరికొత్త రికార్డుగా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా ఈ ఇనిమా ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న అత్తారింటికి దారేది ఓవరాల్ గా 187 కోట్ల గ్రాస్ను కలక్షన్లు కొల్లగొట్టింది.