`శాకుంత‌లం`ను రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్‌.. సీక్రెట్ రివీల్ చేసిన నిర్మాత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `శాకుంత‌లం`. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఈ చిత్రాన్ని అద్భుతమైన దృశ్య కావ్యంగా రూపొందించారు.

గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు ఈ చిత్రాన్ని దాదాపు రూ. 80 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. ఈ ఎపిక్ ల‌వ్ స్టోరీ ఏప్రిల్ 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం ఐదు భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నారు. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో దుష్యంత మహారాజు పాత్ర కోసం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ను సంప్ర‌దిస్తే ఆయ‌న రిజెక్ట్ చేశాడంటూ ఓ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే నిర్మాత నీలిమ గుణ తాజాగా ఈ సీక్రెట్ ను రివీల్ చేశారు. శాకుంతలం సినిమాలో దుష్యంతుడి పాత్రకి ఎన్టీఆర్ ని సంప్రదించలేదని.. ఆయ‌న్ను అడిగినట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. దుష్యంతుడి పాత్రకి సినిమాలో తక్కువ ప్రాధాన్యత ఉంటుందని.. అందుకే స్టార్ యాక్టర్స్ ని ఆ రోల్ కోసం తీసుకోలేదని నీలిమ చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందని.. అయితే అది ఎప్పుడు సెట్ అవుతుందనేది చెప్పలేనని పేర్కొంది.