ఇక ప్రస్తుతం సౌత్ చిత్ర పరిశ్రమలోనే ఎంతో హట్ టాపిక్గా మరిన పేరు పవిత్ర తోకేష్.. సినిమాల కన్నా తన వ్యక్తిగత విషయలతోనే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటూంది. గత కొన్ని దశాబ్దాలుగా పలు భాషల్లో నటించి మెప్పించిన ఈ సీనియర్ భామ .. ముచ్చటగా మూడో పెళ్లితో .. టాలీవుడ్ ఆడియెన్స్ లో అటెన్షన్ రేకెత్తించింది ..అంతగా అందరి చూపు తన వైపు తిప్పుకున్న పవిత్ర లోకేష్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పవిత్ర లోకేష్ విషయానికొస్తే.. కర్ణాటకలోని మైసూర్లో జన్మించారు. ఆమె తండ్రి లోకేష్ కూడా ఒక నటుడు .. ఆమె తల్లి ఉపాధ్యాయురాలు. పవిత్రకు ఆది లోకేష్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక పవిత్ర లోకేష్ చిన్నతనం నుంచి చదువులో ముందు ఉండేది. ఇక ఆమే తోమ్మిదోవ తరగతి చదువుతున్న సమయంలో ఆమె తండ్రి మరణించడు. ఆయన కూడా తన చదువు విషయంలో ఎంతో యాక్టివ్ గా ఉండేది. పదవ తరగతి పరీక్షలో తొలి ర్యాంక్ సాధించి విద్య పట్ల తన మక్కువ చాటుకుంది.
చదువులో ఎంతో యాక్టివ్ ఉండే పవిత్ర ఐఏఎస్ అవ్వాలని కోరిక ఉండేదట. అయితే ఆమె తండ్రి మరణంతో తన కోరికను చంపుకుంది. తన కుటుంబ బాధ్యతలు తన మీద వేసుకుంది. తన తండ్రి కూడా నటుడు అవడంతో మొదటిలో తన తండ్రి వేసిన బాటలో నడవడానికి ఇష్టపడని పవిత్ర మైసూర్ లో మహాజన ఫస్ట్ గ్రేడ్ కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ని పూర్తి చేసింది. ఆ తర్వాత సివిల్స్ సర్వీస్ పరీక్షకు హాజరైంది.
తన తొలి ప్రయత్నం లోనే తన కోరికను సాధించలేకపోయింది. ఆ తర్వాత తండ్రి చూపిన బాటలో బెంగళూరు వెళ్లి తన సినీ కెరీర్ను ప్రారంభించింది. అక్కడ ప్రముఖ కన్నడ స్టార్ హీరో అంబరీష్ సలహా మేరకు 1994 హీరోయిన్గీ తన కెరీర్ను ప్రారంభించింది. మిస్టర్ అభిషేక్ సినిమా ద్వారా పవిత్ర వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది.
కెరీర్ మొదట్లో హీరోయిన్గా పలు సినిమాలు చేసిన పవిత్ర అవి పెద్దగా సక్సెస్ అవ్వకపోవటంతో తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో తల్లిగా, అత్తగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే పవిత్ర లోకేష్ ఇప్పుడు మాత్రం సీనియర్ హీరో నరేష్ తో డేటింగ్ లో కొనసాగుతూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తూ వస్తుంది.