టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ తార ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇటీవలే ఆమె నటించిన శాకుంతలం మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కారణంగా సమంత ఈ సినిమా ప్రమోషన్స్ పాల్గొంటోంది.
తాజాగా శాకుంతలం స్పెషల్ చిట్ చాట్లో భాగంగా సమంత మలయాళ నటులు గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్బంగా సామ్ మాట్లాడుతూ ‘నాకు నటనమీద డౌట్ వచ్చినప్పుడల్లా మలయాళ సూపర్ హిట్ సినిమా డీలక్స్ లోని ఫాహద్ ఫాజిల్ నటనను చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. మలయాళ నటులు అందరూ చాలా అద్భుతంగా నటిస్తారు. వారితో మళ్ళీ మళ్ళీ కలిసి నటించాలని అనిపిస్తుంది ‘ అని చెప్పారు.
‘శాకుంతలం సినిమాని గుణశేఖర్ చాలా గొప్పగా చిత్రీకరించారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది ‘ అని సమంత అన్నారు. అయితే శాకుంతలం సినిమాని బాలీవుడ్లో భారీగా ప్రమోట్ చేస్తుంది సమంత. బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ టు వెబ్ సిరీస్లో నటించింది. అలానే పుష్ప సినిమా ఐటమ్ సాంగ్ అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు శాకుంతలం సినిమాతో ఇంకోసారి బాలీవుడ్ ప్రేక్షకులకు అలరించడానికి రెడీ అయింది. ఈ సినిమా తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో కనిపించబోతుంది.