ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం `శాకుంతలం` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్నిదర్శకుడు గుణశేఖర్ రూపొందించారు. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత శకుంతలగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంత మహారాజుగా నటించాడు.
త్రీడీ ఫార్మేట్లో ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. రెమ్యునరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో హీరోలతో సమాధానం హీరోయిన్లకు కూడా రెమ్యునరేషన్ ఇవ్వాలి. దాని కోసం చాలా గట్టిగా నేను ఫైట్ చేస్తాను. అయితే ప్రత్యక్షంగా కాదు. పరోక్షంగా పోరాడుతున్నాను అని సమంత పేర్కొంది.
రెమ్యురేషన్ కోసం ఎవర్నీ అడుక్కోనని.. తన హార్డ్ వర్క్, విజయాలతోనే కావాల్సినంత దక్కించుకుంటానని స్పష్టం చేసింది. నిర్మాతలే వచ్చి మేము మీకు ఇంత చెల్లించాలనుకుంటున్నాము అని చెప్పాలి. ఇది తీవ్రమైన హార్డ్ వర్క్ తర్వాత వస్తుందని తాను నమ్ముతాను అని పేర్కొంది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.