బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ చాలా కాలం తర్వాత తెలుగులో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే `ఆర్సీ 15`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ఇందులో సునీల్, శ్రీకాంత్, అంజలి, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు స్టోరీ అందిస్తుండగా.. పాపులర్ రైటర్ సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా హీరోయిన్ కియారా పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఫిబ్రవరి 7వ తేదీన ఏడడుగులు వేసింది.
అయితే ఈ సందర్భంగా `ఆర్సీ 15` టీమ్ సర్ ప్రైజింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ కియారా-సిద్ధార్థ్లకు బెస్ట్ విషెస్ తెలుపుతూ.. టీమ్ అంతా పూలు పట్టుకుని ఒకేసారి చల్లుతూ సందడి చేశారు. ఈ వీడియో చూసిన కొత్త పెళ్లి కూతురు కియారా ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇదే వీడియో తన ఇన్స్టా స్టోరీలో పంచుకుంటూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన `ఆర్సీ 15` టీమ్ కు కృతజ్ఞతలు చెప్పింది.
https://twitter.com/SVC_official/status/1624992970104786944?s=20&t=I7OrKYUdoW_AK1h6HLYCBw