మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా SSMB28 ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకునీ. మహేష్ ఇంట్లో జరిగిన వరుస విషాదాలతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక రీసెంట్గా ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇదిలా ఉండగా సాధారణంగా ఏ సినిమా మొదలు పెట్టిన ముందుగానే అందులోని ప్రధాన పాత్ర దారులైన హీరోయిన్, విలన్ వివరాలను వెల్లడిస్తారు. ఎవరెవరు ఏ క్యారెక్టర్ లో నటిస్తున్నారన్న సమాచారాన్ని బయటకు రివిల్ చేస్తారు.
అయితే ఇప్పుడు మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ ఎవరో చెప్పారు గానీ.. ఈ సినిమాలు విలన్ పేరు ఇప్పటికీ రెవిల్ చేయకుండా మిస్టరీగానే ఉంచారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ క్రూరమైన విలన్ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ క్రూరమైన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా.. మరి ఎవరో కాదు టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు. బోయపాటి- బాలయ్య కాంబోలో వచ్చిన లెజెండ్ సినిమాలో క్రూరమైన విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాతో జగపతి బాబు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.
ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో క్రూరమైన విలన్ గా నటించి మెప్పించాడు. త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమాలో కూడా బసిరెడ్డి అనే క్రూరమైన విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా జగపతిబాబునే విలన్గా ఎంపిక చేసినట్టుు తెలుస్తుంది. అరవింద సమేత లోని బసి రెడ్డి క్యారెక్టర్ లో జగపతిబాబు ప్రదర్శించిన విలన్ ఇజం నచ్చి మళ్ళీ త్రివిక్రమ్- మహేష్ కు విలన్ గా ఆయన్ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. నిజానికి ముందుగా ఈ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నుంచి విలన్స్ని దించాలని అనుకున్నారు.
అక్కడ ఎవరూ సెట్ కాకపోవటంతో, సౌత్ లోనూ జల్లెడ పెట్టారు.. అక్కడ ఎవరు సూట్ అవ్వకపోవడంతో ఫైనల్ గా జగపతి బాబుకు ఓకే చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సారథి స్టూడియోస్ లో మహేష్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఇక ఇప్పటికే మహేష్- జగపతిబాబు కలిసి రెండు సినిమాలుకు పైగా నటించారు. వాటిలో శ్రీమంతుడు సినిమాలో మహేష్కు తండ్రిగా నటించిగా. తర్వాత మహర్షి సినిమాలో విలన్గా నటించి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి మహేష్ కు విలన్ గా నటించబోతున్నడు జగపతి బాబు.. ఈసారి ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది.