యాంకర్ రష్మీ ఇంట విషాద ఛాయలు..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా సుదీర్ తో చేసే స్కిట్లు కాని, షోలు కానీ మంచి సక్సెస్ను అందుకుంటూ ఉంటాయి. అయితే ఇటీవల రష్మిక పలు సినిమాలలో కూడా నటించి పలు విజయాలను అందుకుంది. రష్మిక ఎప్పుడు కూడా మూగజీవాలపైన హింసించే వారి పైన చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా నిన్నటి రోజున తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది రష్మి గౌతమ్.

యాంకర్ రష్మి ఇంట విషాదం
బరువెక్కిన గుండెతో కుటుంబం అంతా ఆమెకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికామంటూ రష్మి రాసుకొచ్చింది. అలాగే ప్రమీల మిశ్రా స్ట్రాంగ్ ఉమెన్ అంటూ కూడా తెలియజేసింది. లేడీ యాంకర్లలో గ్లామర్ బ్యూటీగా బుల్లితెరపై తన హవా కొనసాగిస్తూనే ఉంది రష్మి. జబర్దస్త్ వేదికపై తనదైన స్టైల్ లో హోస్టింగ్ చేస్తూ నవ్వులు పూయిస్తూ ఉంటుంది.ప్రతి ఎపిసోడ్లో కూడా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది రష్మి. బుల్లితెర కామెడీసు జబర్దస్త్ తో ఫుల్ పాపులారిటీ అయింది ఈ ముద్దుగుమ్మ.

 బరువెక్కిన గుండెతో కుటుంబం అంతా ఆమెకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికామని పేర్కొంది రష్మీ. ''ప్రమీలా మిశ్రా స్ట్రాంగ్ ఉమెన్. మాపై ఆమె ప్రభావం ఎంతో ఉంది. ఆమె జ్ఞాపకాలు మాతో ఎప్పుడూ ఉంటాయి. ఓం శాంతి'' అని ఎలుపుతూ రష్మీ గౌతమ్ పోస్ట్ పెట్టింది.

ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న వెండితెర పైన తన హవా చూపించలేకపోతోంది. కేవలం బుల్లితెరపై మహారాణిల ఒక వెలుగు వెలుగుతోంది. రష్మీ ఒక్కో షో కి దాదాపుగా రూ .2 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అప్పుడప్పుడు పలు సినిమా ఈవెంట్లలో స్పెషల్ షో కి పోస్ట్ గా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం రష్మి కుటుంబంలో విషాదఛాయలు నెలకొనడంతో పలువురు అభిమానులు రష్మీ గ్రాండ్ మదర్ కు సంతాపం తెలియజేస్తున్నారు.