గత ఆరేళ్ల నుంచి కమర్షియల్ హిట్ లేక సతమతమవుతున్న మెగాస్టార్ చిరంజీవికి `వాల్తేరు వీరయ్య` కొత్త ఉత్సాహాన్ని అందించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో రవితేజ ఓ కీలక పాత్రను పోషించగా.. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను రీచ్ అయిన ఈ చిత్రం.. భారీ లాభాలతో సూపర్ స్టడీ గా దూసుకెళ్తోంది. అయితే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ బాబీకి చిరంజీవి ఓ అదిరిపోయే బహుమతిని ఇచ్చారని ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
బాబీకి తాజాగా చిరంజీవి తన ఇంట్లో ప్రత్యేకమైన విందును ఏర్పాటు చేశారట. అయితే విందుకు వచ్చిన బాబీకి ఓ కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చి చిరు సర్ప్రైజ్ చేశారట.ఇక ఆ కారు ధర దాదాపు రెండు కోట్లకు పైగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాలంటే బాబీ లేదా చిరంజీవి స్పందించాల్సిందే.