నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో శృతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలను పోషించారు.
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైంది. అయితే అంచనాలను అందుకోవడంలో విఫలం అయినా.. పండగ అడ్వాంటేజ్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. ఇకపోతే ఈ సినిమాలో బాగా హైలెట్ అయిన వాటిలో వరలక్ష్మి పాత్ర ఒకటి. బాలయ్య చెల్లెలుగా, విలన్ కు భార్యగా వరలక్ష్మి అద్భుతమైన నటనను కనబరిచింది.
అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ వరలక్ష్మి కాదట. మొదట ఈ సినిమాకు మరో హీరోయిన్ ను అనుకున్నారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు మహానటి కీర్తి సురేష్. వీర సింహారెడ్డి కథ చెప్పగా ఆమె నో చెప్పారట. కొన్ని సన్నివేశాలు కీర్తికి నచ్చకపోవడం వల్ల.. ఆమె ఈ మూవీని తిరస్కరించిందట. దాంతో వరలక్ష్మిను ఎంపిక చేశారని అంటున్నారు.