మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించింది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల వైజాగ్ లో జరిగింది.
ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. వైజాగ్ నగరమంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడి మనుషులకు మంచి మనస్సు ఉంటుందని చెప్పారు. వాతావరణం కూడా చాలా బాగుంటుందని, రిటైర్ తర్వాత సెటిల్ అవ్వడానికి వైజాగ్ చక్కని ప్రదేశమని కొనియాడారు. అలాగే త్వరలోనే తాను వైజాగ్ వాసి కాబోతున్నానని చిరంజీవి వెల్లడించారు.
వైజాగ్లో కొంత భూమి కొనుగోలు చేశానని, ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కూడా చేపట్టబోతున్నట్లు చిరు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు చిరు కొనుగోలు చేసిన ఆ స్థలం విలువ హాట్ టాపిక్ గా మారింది. భీమిలి పొయ్యే దారిలో చిరు కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. ఆ స్థలం కోసం చిరంజీవి సుమారు రూ.30 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ స్థలంలో బీచ్ వ్యూ కనబడేటట్లుగా ఇంటి నిర్మాణం త్వరలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో ఈ ఇంటిని ఎంతో సుందరమయం గా నిర్మించబోతున్నారట.