నటసింహం నందమూరి బాలకృష్ణకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగిందంటే.. ఈ సంక్రాంతికి బాలయ్య `వీర సింహా రెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ప్రమోషన్స్ లో భాగంగానే శుక్రవారం ఒంగోలులో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం బాలయ్య, హీరోయిన్ శ్రుతిహాసన్ ఇతరులతో కలిసి హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వచ్చిన సంగతి తెలిసిందే. రాత్రికి ఒంగోలులోనే బసచేసిన బాలకృష్ణ శనివారం ఉదయం అదే హెలికాప్టర్లో హైదరాబాద్కు బయలుదేరారు.
అయితే ఒంగోలు నుండి హైదరాబాద్ కు ఆయన హెలికాప్టర్ లో వెళ్తుండగా సాంకేతిక లోపం ఏర్పడింది. టేక్ ఆఫ్ అయినా కొద్దిసేపటికి సాంకేతిక లోపం ఏర్పడినట్లు పైలెట్ గుర్తించారు. వెంటనే ఒంగోలు పోలీస్ గ్రౌండ్ కు తిరిగి వచ్చి హెలికాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం నుండి బాలకృష్ణ బయపడ్డారు. ప్రస్తుతం సాంకేతిక లోపం సవరించే ప్రయత్నం చేస్తున్నారు టెక్నీషియన్స్. ఇక రోడ్డు మార్గం ద్వారా బాలయ్య హైదరాబాద్ కు వెళ్లి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.