బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్నేళ్లుగా ఈ సూపర్ స్టార్ ప్లాపులతో సతమతమౌతున్నారు. ఈ క్రమంలో దాదాపు రెండుళ్లుకు పైగా సినిమాలకు దూరంగా వున్నాడు. అయితే షారుఖ్ ఖాన్ తన రీ ఎంట్రీ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఓ సూపర్ స్క్రిప్ట్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాలనే ఆలోచనతో రంగంలోకి దిగుతున్నాడు. అందులో భాగంగా పఠాన్ మూవీని చేస్తున్న షారుఖ్ ఈసినిమాతో పాన్ ఇండియా స్థాయిలో చక్రం తిప్పాలని ట్రై చేస్తున్నాడు.
ఇకపోతే షారుఖ్ ఖాన్ నటిస్తున్న కొత్త సినిమా యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో సిద్ధమైంది. ఈ సినిమాలో దీపికా పడుకోన్, జాన్ అబ్రహాం లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ సినిమా గురించి బాద్షా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుండగా.. తాజాగా పఠాన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కొత్తగా బి టౌన్లో వినిపిస్తుంది. విషయం ఏమంటే ఈ సినిమాను 8 దేశాల్లో షూటింగ్ చేస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. 8 కంట్రీస్, 3 సూపర్ స్టార్స్, వన్ ఫిలిం.. అంటూ సోషల్ మీడియాలో ఈమూవీ టీమ్ యాక్షన్ స్టిల్స్ ను తాజాగా షేర్ చేసింది.
దాంతో సినిమా ప్రమోషన్స్ కి మంచి ఊపు వచ్చినట్టైంది. ఇపుడు అందుకే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. 8 దేశాల్లో షూటింగ్ అంటే స్పెయిన్, UAE, టర్కీ, రష్యా, సెర్బియా, ఇటలీ, ఫ్రాన్స్, అఫ్గాన్ దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇలా ఇంతవరకూ ఏ సినిమా కూడా ఇలా షూటింగ్స్ జరగలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో కొంతమంది నెటిజన్లు విచిత్రంగా కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది బాద్షా అంటే ఏమాత్రం ఉండాలి అని షారుఖ్ ని తెగ పొగిడేస్తున్నారు.