తెలుగు చిత్ర పరిశ్రమలో తన యాటిట్యూడ్ తో ..తన నటనతో ప్రేక్షకులలో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. తన సినిమాలతో హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ… తన తర్వాతి సినిమా అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. విజయ్ కి అర్జున్ రెడ్డి సినిమా తర్వాత చెప్పుకోదగ్గ సినిమా అంటే గీత గోవిందం.. ఈ సినిమా విజయ్ కి అదిరిపోయే హిట్ ఇచ్చింది.
ఈ రెండు సినిమాల తర్వాత నుండి విజయకు చెప్పుకోదగ్గ హిట్ట్ సినిమా లేదు. తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ సినిమాలు గా మిగిలిపోయాయి. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా లైగర్ . ఈ సినిమా కూడా విడుదలై విజయ్ దేవరకొండ కెరియర్ లోనే చెత్త సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా ప్లాప్ తో విజయ్ దేవరకొండ మరియు అతని అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. ఇంత భారీ డిజాస్టర్ సినిమా తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండకు తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
లైగర్ సినిమాలో విజయ్MMA ఛాంపియన్ షిప్ కి ట్రైనింగ్ అయ్యే బాక్సర్ గా నటించాడు. అయితే ఇప్పుడు దుబాయిలో నిర్వహించేMMA ఛాంపియన్ షిప్ బాక్సింగ్ పోటీలకు అక్కడి ప్రభుత్వం విజయ్ దేవరకొండను అతిధిగా ఆహ్వానించిందట. అబుదాబి గవర్నమెంట్ నుంచి భారతీయ నటుడుగా విజయ్కు ఆహ్వానం అందడంతో అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి అనే లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ కి జంటగా సమంత నటిస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.. క్రిస్మస్ కనుక గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.