మరొకసారి కీలకమైన వ్యాఖ్యలు చేసిన పూనమ్ కౌర్..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుచేత అంటే ఈమె సినిమాలకంటే ఎక్కువగా వివాదాల్లోనే నిలుస్తూ ఉంటుంది. తన దగ్గరికి వచ్చిన విషయాల పైన.. అభిప్రాయాల పైన తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. మరి కొన్ని సామాజిక న్యాయాల పైన అప్పుడప్పుడు గొంతు విప్పుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇప్పుడు అబార్షన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతిస్తూ మళ్ళీ వార్తల్లో నిలిచింది. సుప్రీంకోర్టు నిన్నటి రోజున ఈ విషయంపై పలు కీలకమైన విషయాలను కూడా వెల్లడించింది.

గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళలు ,వివాహితులై ఉండాల్సిన నియమమేమి లేదని.. అత్యున్నత న్యాయస్థానం తెలియజేసింది. వివాహితులు అవివాహితులు అని తేడా లేకుండా సురక్షితమైన చట్టపరమైన అబార్షన్ కు మహిళలు ఎవరైనా అర్హులేనని తెలియజేసింది. మెడికల్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం ఒంటరి మహిళలు మరియు అవివాహిత మహిళలకు కూడా అభాష చేసుకుని హక్కు ఉందని కూడా కోర్టు తెలియజేసింది. అయితే కోర్టు నిబంధనల ప్రకారం కేవలం 24 వారాల గర్భాన్ని మాత్రమే తొలగించుకునేందుకు అర్హులని తెలియజేసింది కోర్టు. ఈ విషయంపై తనదైన స్టైల్ లో స్పందించింది పూనమ్ కౌర్ .

సుప్రీంకోర్టు తీర్పుకు పూనమ్ కౌర్ కూడా మద్దతు తెలుపుతూ.. గర్భం వచ్చిన తర్వాత పురుషుల తమ రిలేషన్షిప్ కు కట్టుబడి ఉండమని కొంతమంది బలవంతం చేయడం తను చూశానని తెలియజేసింది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితమంతా అనేక విధాలుగా బాధపడవలసి వస్తుంది.. స్త్రీలు తమ పునరుత్పత్తి శక్తిని స్వార్థ ప్రయోజనాల కోసం అవసరమయ్యే ఆయుధంగా ఉపయోగించుకోకూడదని పూనమ్ కౌర్ తెలియజేసింది. ఇక పూనమ్ చేసిన ఈ కామెంట్స్ ఎవరినో టార్గెట్ చేస్తూ ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.