టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే..వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ మీద ఉంది. అమ్మడు కు శుక్ర మహాదశ నడుస్తున్నట్లు ఉంది..అందుకే పట్టిందల్లే బంగారమే అవుతుంది. అమ్మడు చేసిన సినిమాలన్ని బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజాయాని అందుకోవడమే కాకుండా..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో అమ్మదు వాళ్ళ పాలిట లక్కి దేవతగా మారిపోయింది. టాలీవుడ్ లోనే కాదు..బాలీవుడ్..ఇప్పుడు కోలీవుడ్ లో కూడా అమ్మడు కాళ్లు మోపింది. విజయ్ తో కలిసి బీస్ట్ అనే మూవీ చేస్తుంది.
కాగా , పూజా ప్రభాస్ రీసెంట్ గా నతీంచిన సినిమా “రాధేశ్యామ్” సినిమా పెద్ద ఆకట్టుకోనప్పటికి..పూజా అందాలకి..పర్ ఫామెన్స్కి మాత్రం మంచి మార్క్లే వచ్చాయి. దీంతో పూజా హెగ్డే మరింత పాపులారిటీని సంపాదించుకుంది. బడా బడా స్టార్స్ అందరు కూడా ఇప్పుడు పూజా నే తమ సినిమాల్లో హీరోయిన్ గా ఉంచుకోవడానికి చూస్తున్నారు. దీని బట్టి అమ్మడు క్రేజ్ ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రజెంట్ బాలీవుడ్ లో లో కూదా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న బ్యూటి..మరికొన్ని రోజుల్లో “సర్కర్” అనే చిత్రం ద్వారా మనల్ని పలకరించడానికి రాబోతుంది. బీటౌన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘సర్కస్’ చిత్రం త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ నటిస్తున్నాడు. తెర పై రణ్వీర్ సింగ్-పూజా హెగ్డే కలయిక ఎలా ఉంటుందో చుడటానికి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా పూజా యాక్టీవ్ గా పాల్గోంటుంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న పూజా..సినిమా గురుంచి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ..” ఈ సినిమాలో మీరు మరో కొత్త పూజాని చూస్తారు. ఇప్పటి వరకు నన్ను ఇలాంటి క్యారెక్టర్ లో మీరు చూడలేదు. డైరెక్టర్ నా పాత్రను చాలా కొత్తగా..ఢిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఈ సినిమా లో రణ్వీర్ సింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా గా ఉంది. సినిమా షూటింగ్ టైంలో మేం మచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఆయన తో నటించడం ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. ఆయన షూటింగ్ సెట్ లో ఉంటే ఫుల్ సందడిగా ఉంటుంది. రణ్వీర్ సింగ్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ . అందుకే నేను తనని ‘పమ్మీ ఆంటీ’ అని పిలుస్తాను. ఈ సినిమాలో మా ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది’ అని చెప్పుకొచ్చింది. దీంతో రణ్వీర్ అభిమానులు పూజా పై గుర్రుగా ఉన్నారు . అంత పెద్ద హీరోని ఆంటీ అని పిలవడం ఏంటి..అంటూ మండిపడుతున్నారు.