టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ సెక్యురిటీ గార్డుగా మారాడు. అవును, మీరు విన్నది నిజమే. కానీ, ఇది రియల్ కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజ్ తరుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశిష్ ఖాన్ హీరోయిన్గా నటించగా.. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది.
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమా మూడో సాంగ్ను విడుదల చేశారు. సెక్యూరిటీ గార్డుల మీద తెరకెక్కిన ఈ మూడో పాటను హైదరాబాద్లోని ఏఎంబి మాల్ లో సెక్యూరిటీ గార్డుల సమక్షంలోనే రిలీజ్ చేశారు.
`బతికే హాయిగా..` అంటూ సాగిన ఈ సాంగ్లో రాజ్తరుణ్ సెక్యురిటీ గార్డుగా బాగానే అలరించాడు. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట వైరల్గా మారింది. కాగా, ఈ సాంగ్కు భాస్కర భట్ల సాహిత్యం అందించగా దీపు ఆలపించారు. గోపీసుందర్ స్వరాలు సమకూర్చారు.