పుష్ప సాంగ్ కోసం సమంత రికార్డు స్థాయిలో పారితోషికం..!!

సమంత.. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఈమె దృష్టి అంతా కెరియర్ పై పెట్టింది . అందులో భాగంగానే ఈమె వరుస సినిమాలకు ఓకే చెబుతూ బిజీ గా మారడానికి ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రీసెంట్ గా సమంత ఒక ఐటం సాంగ్ లో చేస్తోంది అని సమాచారం రాగా..అది నిజమే అంటూ మేకర్స్ కూడా నిన్న అనౌన్స్ చేశారు..


అయితే ఈ సాంగ్ పై ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంత ఐటమ్ సాంగ్ లో నటిస్తోంది అని చెప్పడమే ఒక ఆశ్చర్యం అయితే.. ఇప్పుడు ఆమె ఆ పాట కోసం ఏకంగా రూ.1.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది అంటూ మరో షాకింగ్ కామెంట్స్ వెల్లడించారు చిత్రం యూనిట్. అంతేకాదు సౌత్ ఇండియా లోనే ఒక హీరోయిన్ కి కేవలం ఒక పాటకోసం రికార్డు స్థాయిలో పారితోషికం ఇవ్వడం ఇదే మొదటిసారి. దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే లెవెల్ లో కంపోజ్ చేశాడు అని.. ఈ చిత్రం లో 5వ పాట రిలీజ్ చేయనున్నారట. థియేటర్లలో విడుదల అయితే ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి మరి.