మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రేమలో పడ్డాడా.. త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. బైక్ యాక్సిడెంట్ తర్వాత తిరిగి 35 రోజుల తర్వాత తను కోలుకొని తన ఇంటికి చేరుకున్నాడు.సాయి ధరంతేజ్ కు ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల ఎంతోమంది సోషల్ మీడియాలో తన కోలుకోవాలని పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇక సాయి ధరంతేజ్ ఒక హీరోయిన్ మోడల్ తోనే ప్రేమలో ఉన్నట్లు గా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలు అన్నిటికీ కారణం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అని తెలుస్తోంది. ఇక హీరోయిన్ ఎవరో కాదు సాయి ధరమ్ తేజ్ నటించిన తిక్క సినిమాలో హీరోయిన్.. లారిస్సా బొనేసి.. ఈమె బ్రెజిలియన్ మోడల్ మరియు హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించింది.
TODAY IS THE DAY !! My Teju @IamSaiDharamTej 🙏🏾🧿♥️ #Republic pic.twitter.com/hL9uEDlHIK
— Larissa Bonesi (@larissabonesi) September 30, 2021
అయితే ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇక సాయి ధరంతేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా విడుదల సమయంలో లారిస్సా.. నా తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఈ రోజు విడుదల అవుతోంది అంటూ.. లవ్ సింబల్స్ లో కొన్ని పోస్టులు జోడించింది. ఇక ఆ తర్వాత ఐ మిస్ యు తేజ అంటూ ట్వీట్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ఎక్కువయ్యాయి.
I’m in love .
— Larissa Bonesi (@larissabonesi) October 15, 2021