మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ సంచలన వ్యాఖ్యలు?

అక్కినేని అఖిల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకోవడానికి చాలా విధాలుగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించాడు. ఈ సినిమా మొదటి రోజే మంచి హిట్ టాక్ ను అందుకుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్ ని వేగవంతం చేసింది. ఈవెంట్ లో అఖిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అరవింద్ గారు కాల్ చేసి సినిమా చూద్దామా అని అడిగినప్పుడు చాలా ఆనందపడ్డాను.. అదిలవ్ స్టోరీ అని తెలియడంతో డిజప్పాయింట్ అయ్యాను. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఎంటర్ అయిన తర్వాత సినిమా స్థాయి మారిపోయింది. ఆయన కథ చెప్పగానే ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఇక ప్రాజెక్టు మొదలు పెట్టే సమయంలో బొమ్మరిల్లు భాస్కర్ కు ఇట్లు లేవని తాను అనుకోలేదని, నేనేం బ్లాక్ బస్టర్ ఇచ్చి రాలేదు కదా అంటూ అఖిల్ ఓపెన్ కామెంట్ చేశారు. ఇప్పటివరకూ మంచి సక్సెస్ కోసం ఎదురు చూసిన అఖిల్ కు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ రావడంతో అఖిల్ తో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు.