ఎన్టీఆర్ తర్వాత లెజెండ్ మోహన్ బాబు.. కృష్ణమోహన్ షాకింగ్ కామెంట్స్?

గత కొద్దీ రోజులుగా మా ఎన్నికల గురించి రోజూ ఏదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రకాశ్ రాజ్-మంచు విష్ణు మద్య తీవ్ర స్థాయిలో పోటీ జరిగిన విషయం మన అందిరికి తెలిసిందే. ఈ క్రమంలో ఇరువురి మద్య మాటల యుద్దం జరిగింది. ఇక గత ఆదివారం రోజు ఎన్నికలు ముగిశాయి.అందులో మంచు విష్ణు విజయం దక్కించుకున్నారు. మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ సైతం పక్షపాతం చూపించాడనే ఆరోపణలు వచ్చాయి. ఈసీ మెంబర్ల బాలెట్ బాక్సులను ఇంటికి తీసుకెళ్లాడంటూ ఈటీవీ ప్రభాకర్ ఆరోపణలు చేశాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా సాగింది.

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు తో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలోనే మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత అంతటి లెజెండ్ ఒక్క మోహన్ బాబు మాత్రమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మాటకు అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలుస్తోంది. మా అసోసియేషన్ పెట్టి 28 ఏళ్లు అవుతున్నాయి, 14 మంది ప్రెసిడెంట్లు వచ్చారు. ఇందులో పదిమంది ప్రెసిడెంట్లు నా ఆధ్వర్యంలో ఎన్నికయ్యారు. ఇక ఈ సారి మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ తర్వాత అంతటి లెజెండ్ మోహన్ బాబే అని అతని పై ప్రశంసల వర్షం కురిపించాడు.