మా ఎన్నికల లో మరో ట్విస్ట్.. లీకైన సీసీ టీవీ ఫుటేజ్..!!

మా ఎన్నికలు జరిగి అధ్యక్షపదవిని మంచు విష్ణు కైవసం చేసుకున్నప్పటికీ మా ఎన్నికలకు సంబంధించిన వివాదాలు ఇప్పటికీ పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇకపోతే మా ఎలక్షన్లకు ముందు ఒకరికొకరు తిట్టుకోవడాలు.. కొరుక్కోవడాలు.. దూషించు కోవడాలు.. ఇలా ఎన్నో చూడాల్సి వచ్చింది.. అంతేకాదు ఈ మా ఎలక్షన్ల తో సినీ తారల అంతా ప్రేక్షకులకు చులకన అయిపోయారు. రాజకీయ నాయకుల కంటే మరీ ఘోరంగా పన్నాగాలు పన్ని ఎలక్షన్ల ను నిర్వహించడం జరిగింది అంటూ వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఈ మా ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందని వార్తలు వినిపిస్తూనే ఉండడం గమనార్హం..తాజాగా మా” ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో సర్వర్ రూమ్‌కు తాళం వేశారు. పోలింగ్ రోజు మోహన్ బాబు తమపై దాడి చేశారని ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడి దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో ఉన్నాయన్నారు. తమకు సీసీ ఫుటేజ్ అందజేయాలని ప్రకాశ్‌ రాజ్ కోరగా ఫుటేజ్ ఇవ్వలేమని ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణ మోహన్ తెలిపారు.

ఇలా ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ తెలపడంతో మా ఎన్నికలలో ఏదో జరిగింది అని కుట్రపన్ని మంచు విష్ణు అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.