పండుగ రోజు మెగా అభిమానులకు శుభవార్త..!

విజయ దశమి పండుగ సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపారు. అదేమిటంటే హీరో సాయి ధరంతేజ్ ఈ రోజున హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపుగా రోడ్డు ప్రమాదం జరిగి 35 రోజుల తర్వాత సాయి ధరంతేజ్ దసరా పండుగ సందర్భంగా.. అందులో తన పుట్టిన రోజు నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక దీంతో సాయి ధరంతేజ్ పుట్టిన రోజు తిరిగి ఇంటికి రావడంతో ఆయన మామయ్య మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ నుంచి ట్వీట్ చేశాడు. హీరో సాయి ధరమ్ తేజ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకొని ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ తెలియజేశాడు.

ఇక వీరితో పాటు అల్లు అర్జున్ వరుణ్ తేజ్, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. గత నెల 11వ తేదీన సాయిధరమ్తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజున హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ రోజు నిజమైన పండగలాంటి వార్త అంటూ తెగ ఆనందిస్తున్నారు.