మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ గత నెల 10వ తేదీనా హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్పై నుంచి స్కిడ్ అయిన సాయి తేజ్ తీవ్ర గాయాల పాలై.. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని మెగా హీరోలు, సన్నిహితులందరూ ఎప్పటి నుంచో చెబుతున్నారు.
అయినప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు అని అభిమానులు రోజూ ఆరా తీస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో స్వయంగా సాయి ధరమ్ తేజ్ నుంనే ట్వీట్ వచ్చింది. తనపైనా, తన చిత్రం ‘రిపబ్లిక్’ పైనా చూపుతున్న ప్రేమాభిమానాలు, ఆపేక్ష పట్ల థాంక్స్ అని చెబితే అది చాలా చిన్న మాట అవుతుందని.. త్వరలోనే అందరి ముందుకు వస్తానని సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ లో వెల్లడించాడు.
అంతేకాదు, బొటనవేలిని పైకెత్తి తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను కోలుకున్నానన్న సంకేతాలు పంపాడు. దాంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇక యాక్సిడెంట్ అయిన తర్వాత సాయి తేజ్ చేసిన తొలి ట్వీట్ ఇదే కావడంతో.. అది తెగ వైరల్ అయిపోతుంది.
https://twitter.com/IamSaiDharamTej/status/1444637180874276867?s=20