గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలపై, అలాగే సినిమా టికెట్ రేట్లపై విషయంలో ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వంతో చర్చించడానికి టాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు.అయితే గత నెల రోజుల నుంచి ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతోంది. ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకు ఆహ్వానం రావడం, అందరూ కలిసి చిరంజీవి ఇంట్లో కలవడం, సమస్యల గురించి చర్చించడం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో నేడు మంత్రి పేర్ని నానితో పాటు పలువురు సినీ నిర్మాతలు,అలాగే డిస్ట్రిబ్యూటర్లు భేటీ కాబోతున్నారు.
అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలతో ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని సమావేశం కానున్నారు. ఇండస్ట్రీ తరపున సినిమా పలువురు ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, పంపిణీదారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వల్ల సినిమా పరిశ్రమకు ఎదురైన ఇబ్బందులు మొదలైన విషయాలపై చర్చించి సినిమా ఇండస్ట్రీ సమస్యలకు ఓ పరిష్కారం తీసుకురానున్నారు. ఆన్లైన్ టికెట్ పై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీస్కోలేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆన్లైన్ సినిమా టికెట్ అంశం పై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.