ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే తండ్రిని నందిత కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 19) నందిత తండ్రి శివ స్వామి (54) కన్నుమూశారు. దాంతో ఆమె కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇక తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని స్వయంగా వెల్లడించిన నందిత.. `నా తండ్రి శ్రీ శివ స్వామి 54 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.` అని ట్వీట్ పెట్టింది. దీంతో ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నందిత ఫ్యామిలీకి ధైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నారు.
కాగా, కర్నాటకకి చెందిన నందిత శ్వేత నిఖిల్ హీరోగా తెరకెక్కిన `ఎక్కడికిపోతావు చిన్నవాడా` సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమకథా చిత్రమ్ 2, అభినేత్రి 2 ఇలా పలు తెలుగు సినిమాలు చేసిన నందిత స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది.