`ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. తొలి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. నటన పరంగా కూడా వందకు వంద మార్కులూ వేయించుకున్న కృతి.. ఉప్పెన తర్వాత వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.
ప్రస్తుతం ఈ భామ నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్ బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగచైతన్య సరసన `బంగార్రాజు`, నితిన్ సరసన `మాచర్ల నియోజకవర్గం` తదితర చిత్రాల్లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్లో అంగరంగవైభవంగా జరిగిన `సైమా` అవార్డ్స్ వేడుకలో కృతి శెట్టి పాల్గొంది. ట్రెండీ వేర్ ధరించిన కృతి తన క్యూట్ అందాలతో కుర్రాళ్లకి మతి పోగొట్టేసింది. ఆమెని చూడగానే ఎవ్వరైనా ఫిదా అయిపోతారు. అంత అందంగా కృతి ముస్తాబై వచ్చింది. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి.