తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో గోపీచంద్ సరసన నటించిన హీరోయిన్ కామ్నా జఠ్మలానీ. ఇమే రణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగు వేసింది. ఇక రణం సినిమా కంటే ముందు ఈమె కొన్ని సినిమాలలో నటించిన ఆచిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కానీ రణం చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టడం చేత.. ఇక ఈమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.
ఆ తర్వాత ఈమె కన్నడ, తమిళం,మలయాళం.. ఇలా ఇతర భాషల హీరోయిన్ గా నటించింది. కానీ అనుకోని కారణాల చేత ఈమె సినీ ఇండస్ట్రీ వైపు దూరమై ఒక ప్రముఖ వ్యాపారవేత్తని వివాహం చేసుకున్నది. ఇక కుటుంబ పరిస్థితుల కారణంగా ఈమె సినిమాలకు దూరం అయింది. కానీ ఈ మధ్య కాలంలో ఇమే సోషల్ మీడియాకి బాగా దగ్గరయింది. అయితే దీంతో ఈమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అంతే కాకుండా అప్పుడప్పుడు ఈమె బరువు తగ్గేందుకు కొన్ని వర్క్ చేస్తున్న ఫోటోలు.. ఆహారపు డైట్ వంటివి పాటిస్తున్నట్లుగా,తన కు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఇన్స్టాగ్రామ్ ద్వారా. అయితే ఈమె త్వరలో నాయనా సినీ ఇండస్ట్రీలోకి తిరిగి రీ ఎంట్రీ ఇస్తుందేమో వేచి చూడాల్సిందే.https://www.instagram.com/reel/CS1Tzz8l7z_/?utm_source=ig_web_copy_link