వై.యస్. విజయమ్మ సంస్మరణ సభకు హాజరవుతున్నది వీరే..!

వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా పని చేస్తున్న వైఎస్ విజయమ్మ.. నేడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున.. కూతురు షర్మిల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో సంస్మరణ సభను ఏర్పాటు చేస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే.. అయితే ఈ రోజు ఆమె హైటెక్స్ నోవటెల్ హోటల్ లో వైఎస్ సంస్మరణ సభ నేడు జరుగుతున్న నేపథ్యంలో నిన్న 300మందిని ఈ సభకు ఆహ్వానించినట్లు సమాచారం.. ఇక ఈ విషయం తెలియడంతో ఎవరెవరు ఈ సంస్మరణ సభకు హాజరు అవుతారు.. ఎవరెవరు రారు అనేది హాట్ టాపిక్ గా మారింది..

అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆ హోటల్లో విజయమ్మ సారధ్యంలో సభ జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో ఏకంగా 350 మంది అతిథులకు ఆహ్వానం పలికారు విజయమ్మ.. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 44 మంది నేతలు, 18 మంది ప్రముఖ వ్యాపార వేత్తలు, 40 మంది సినీ ప్రముఖులు, 16 మంది వైద్యులు, 17 మంది సామాజిక వేత్తలు ఈ సభకు హాజరు అవుతున్నట్లు సమాచారం .ఇక వీరితో పాటు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు రిటైర్డ్ జడ్జీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. ఇక ముఖ్యంగా 33 మంది ప్రముఖులకు ఈ సభలో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తారట.