పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `సలార్`. ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ను అందించారు మేకర్స్. ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్పేయి నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో ఆయనది మెయిన్ విలన్ క్యారెక్టర్ అని అంటున్నారు.
అయితే ఇప్పుడు ఈయన క్యారెక్టర్ను పరిచయం చేసేందుకు సలార్ యూనిట్ ముహూర్తం ఖరారు చేశారు. `రాజమనార్` అనే ఓ పవర్ పాత్రను రేపు ఉదయం 10.30ని.లకు రివీల్ చేయనున్నామని తాజాగా సలార్ మేకర్స్ పోస్టర్ రివిల్ చేశారు.