వివాదాలకు, వివాస్పద వ్యాఖ్యలకు ఆమడ దూరంలో ఉండే వ్యక్తుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. షూటింగ్ సమయాల్లో మినహా పెద్దగా బయట కనిపించని వెంకీ.. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండరు. ఏ విషయంలో అయినా ఎంత వరకూ మాట్లాడాలో అంత వరకే మాట్లాడతారు. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల విషయంలోనూ వెంకీ సింపుల్గా తేల్చేశారు.
వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో ప్రియమణి హీరోయిన్గా నటించింది. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 20న విడుదల చేస్తున్నారు.
ఇక విడుదల దగ్గర పడుతుండడంతో.. చిత్ర యూనితో పాటుగా వెంకీ కూడా ప్రమోషన్స్ నిర్విస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో `మా` ఎన్నికల గురించి ప్రశ్నించగా.. వెంకీ `ఏదీ మన చేతుల్లో లేదు. ఏదైనా జరగొచ్చు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఎలక్షన్ల నేపథ్యంలో జరిగే విమర్శలు, మాటల తూటాలు శాశ్వతం కాదు` అని తేల్చేశారు.