సోనూసూద్.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోతోంది. కరోనా కష్ట కాలంలో సాయానికి మారు పేరుగా మారిన సోనూ.. కనివిని ఎరుగని రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. దేశ వ్యాప్తంగా నలుమూలలా తన సాయాన్ని అందించిన సోనూసూద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు లేకపోవడంతో సాయం కోసం ఆయా గ్రామాల సర్పంచులు ఇటీవల సోనూసూద్ సాయం కోసం సంప్రదించారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మృతదేహాల సంరక్షణ కోసం మార్చురీ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను అందించేందుకు సోనూ శ్రీకారం చుట్టుఆరు.
సానికిరెడ్డి పల్లి ఆషాపూర్ బోంకూర్ ఓర్వకల్ మడ్డికేరా మరియు ఇంకా చాలా గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక త్వరలోనే ప్రతి గ్రామంలోనూ ఈ ఫ్రీజర్ బాక్సాలను ఏర్పటు చేయనున్నట్టు సోనూ మాటిచ్చారు.