ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక మందన్నా.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే రష్మిక..ప్రస్తుతం షూటింగ్ లు లేకపోవడంతో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటోంది. తాజాగా కూడా తన ఫాలోవర్స్తో లైవ్ ఛాట్ నిర్వహించింది. ఈ లైవ్ ఛాట్లో ఓ నెటిజన్ డేట్ కు వెళ్లే ఛాన్స్ వచ్చింది అంటే ఏ హీరోతో వెళతారు అని ప్రశ్నించగా.. అందుకు రష్మిక ప్రభాస్ అని సమాధానం ఇచ్చి ఆయనపై క్రేజీ ఫీలింగ్స్ బయట పెట్టింది.
తనకు ఇష్టమైన హీరోల్లో ప్రభాస్ ఒకరు అని తెలిపిన రష్మిక.. డార్లింగ్ ఒప్పుకోవాలే కాని నేను ఆయనతో డేట్కు రెడీ అని ఓపెన్గానే చెప్పేసింది. ఇక రష్మిక కామెంట్స్పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.