దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్లో కరోనా విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ఎప్పుడు, ఎటు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో కూడా ఊహించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు.
తాజాగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. అభిజిత్ తల్లి లక్ష్మి ప్రసన్నకి కరోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు అభి.
ఏం జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. కుటుంబ సభ్యులందరికి నెగెటివ్ రాగా, అమ్మకు పాజిటివ్ అని వచ్చింది. సీటీ లెవల్స్ బాగుండడం కొంత ఊరటనిచ్చే విషయం. అమ్మ త్వరలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ కోవిడ్ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మానసికంగా ధైర్యంగా ఉండాలి అని అభిజిత్ చెప్పుకొచ్చాడు.