టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం స్టాండప్ రాహుల్ ఒకటి. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంతో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అలాగే మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేం వర్ష బొల్లమ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.
డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై హైఫైవ్ పిక్చర్స్ లో నంద్కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు రాజ్ తరుణ్ బర్త్డే. ఈ సందర్భంగా స్టాండప్ రాహుల్ చిత్రం నుంచి కొత్త పోస్టర్ను విడదల చేశారు మేకర్స్.
డిఫరెంట్గా ఉన్న ఈ పోస్టర్ రాజ్ తరుణ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. మరియు సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. మొత్తానికి పోస్టర్ బట్టీ చూస్తుంటే.. రాజ్ తరుణ్ ఏదో కొత్త ప్రయోగమే చేస్తున్నట్టు అర్థం అవుతోంది.