నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే28న గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
ఇక బాలయ్యకు పోటీగా అదే రోజు తాను నటిస్తున్న `ఖిలాడి` చిత్రాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు మాస్ మహారాజా రవితేజ ప్రకటించాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంల్ మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా మే28న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవలె ప్రకటించింది.
అయితే ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్లో వేగంగా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో అందరూ తమ సినిమాలను వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అఖండ, ఖిలాడి కూడా వాయిదా పడనున్నాయని అంటున్నారు. అయితే విడుదల వాయిదా పడినా ఈ ఇద్దరి హీరోల మధ్య పోటీ ఖాయమంటున్నారు. ఎప్పుడు ఎనౌన్స్ చేసినా మళ్ళీ ఒకేరోజు తమ సినిమాల్ని పోటీకి దించుతారట ఈ హీరోలు. మరి ఇందు వరకు నిజం అవుతోందో చూడాలి.