మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవా కట్ట దర్శకత్వంలో `రిపబ్లిక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్కు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ను సుకుమార్ విడుదల చేశారు.
`ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో, అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం… కానీ, కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలో బతుకుతున్నాం అంటూ సాయి తేజ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్తో ప్రారంభమైన ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాయి ధరమ్ తేజ్ లుక్స్ కూడా అదిరిపోయాయి. మొత్తానికి ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.