నియోజకవర్గంలో మాజీ మంత్రి అఖిలప్రియకు రాజకీయంగా మరోకసారి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా భూమా వర్గంలో ఉంటూ చాగలమర్రి మండలంలో అండగా నిలుస్తూ వచ్చిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామగురివి రెడ్డితో పాటు చిన్నవంగలి పంచాయతీ సర్పంచ్ సయ్యద్వలి టీడీపీని వీడిచి వైఎస్సార్సీపీలో చేరారు. వీరితో పాటుగా వెంకటరెడ్డి, ప్రతాప్రెడ్డి, బికారిసాహెబ్, రాజు, డల్లె షరీఫ్, పీరాం సాహెబ్, చిన్న ఇమాంసా, అల్లాబకాష్, పద్మకుమార్రెడ్డి అయిన భూమా వర్గం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడం ఆశ్చర్యం.
వీరిని ఆదివారం ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి సాదరంగా పారీ్టలోకి ఆహ్వానించారు. భూమా కుటుంబానికి చాగలమర్రి మండలం సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా అండగా ఉంటూ వస్తుంది. అలాంటి మండలంలో నేడు భూమా వర్గానికి చెందిన పలువురు నాయకులు అందరు కలిసి గంగుల సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరడం విశేషం. ఇప్పటికే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో భూమా వర్గం ఘోర పరాజయం పాలయింది.