టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఆగస్టు 13న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. పుష్ప పూర్తి కాకుండానే బన్నీ తన తర్వాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తన తదుపరి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడట. ఇటీవలె అనిల్ బన్నీ ఓ కథ చెప్పగా.. అది బాగా నచ్చడంలో వెంటనే ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే.. సక్సెస్ఫుల్ డైరెక్టర్తో స్టైలిష్ స్టార్ కాంబో సూపర్ క్రేజీ ఉంటుందని అంటున్నారు. కాగా, గత ఏడాది సరిలేరు నీకెవ్వరుతో మహేష్కు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన అనిల్ ప్రస్తుతం ఎఫ్ 3 చేస్తున్న సంగతి తెలిసిందే.