టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. రాజకీయాల్లో చిన్న బ్రేక్ ఇచ్చిన పవన్.. తన సినిమాల్లో బిజీ అయిపోతున్నారు. ఇప్పటివరకు సైన్ చేసిన సినిమాలను కచ్చితంగా పూర్తి చేసి తీరుతానంటూ.. ఫ్యాన్స్ కు, నిర్మాతలకు ఇచ్చిన మాట ప్రకారం పవన్ ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూట్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా పని పూర్తయిన వెంటనే పవన్ ఓజి సెట్స్లో పాల్గొంటున్నాడని టాక్ నడుస్తుంది. తాజాగా సినిమాకు సంబంధించిన చిన్న స్కెడ్యూన్ లు కూడా పూర్తి చేశారట.
స్టూడియోలో వేసిన సెట్లోనే షెడ్యూల్ పూర్తయిందని.. త్వరలోనే ముంబైలో మరో కొత్త స్కెడ్యూలో పవన్ పాల్గొనబోతున్నాడని టాక్ నడుస్తుంది. అయితే ఇంకా ఈ షెడ్యూల్ కోసం 15 రోజుల సమయం కావాల్సి ఉండగా.. పవన్కు ఉన్న బిజీ టైం టేబుల్ లో 15 రోజులు డేట్స్ కేటాయించడం కష్టమవుతుందని.. ఈ క్రమంలోనే 15 రోజులు కాకున్నా వీలైనంత వేగంగా పవన్ కు సంబంధించిన సన్నివేశాలు అన్నింటిని పూర్తిచేసేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తుందట.
ఇక ఈ 15 రోజుల షూట్ను పవన్ పూర్తి చేసేస్తే శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించే సినిమాలో సెప్టెంబర్ నెలలో తెరపైకి తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ సిక్వెల్ కి పోటీగా ఈ సినిమా రిలీజ్ అవ్వనుందని టాక్. ఇక రూ.250 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమా కోసం.. దర్శకత్వం వహించడంతో ఆడియన్స్ లో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. డీవివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా టాలీవుడ్ రేంజ్ను మరింతగా పెంచే సినిమాగా మారుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఓజి సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందా అనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఓజీ సినిమాలో.. మొదటి నుంచి చివరి సీన్ వరకు ప్రతి సీన్ అద్భుతంగా పండుతాయి అని.. ఆడియన్స్ను కచ్చితంగా ఆకట్టుకుంటాయని టాక్. పాన్ ఇండియన్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సైతం భారీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఈ సినిమాతో పవన్ సంచలనం సృష్టించాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే రెండు సినిమాలతో పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ పెట్టేయడం ఖాయమంటూ.. అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.