అక్కినేని సామ్రాట్ నాగచైతన్య గతకొంతకాలంగా వరుస ఫ్లాప్లు చూస్తున్న సంగతి తెలిసిందే. అ క్రమంలోనే ఇప్పుడు తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న తండేల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని తెగ ఆరాటపడుతున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై సుమారు రూ.70 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ సినిమాల్లో.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక గతంలో చందు మండేటితో చైతు సవ్యసాచి సినిమా చేసినా.. అది ఊహించిన సక్సెస్ అందుకోలేదు. అయితే తర్వాత చందు.. కార్తికేయ 2తో భారీ బ్లాక్ బస్టర్ హీట్ అందుకుని.. సక్సెస్ స్ట్రీక్లోకి వెళ్ళాడు. ఈ క్రమంలోనే చందుకి మరోసారి నాగచైతన్య అవకాశం ఇచ్చారు.
ముందుగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని అనుకున్నా.. డేట్స్ టాప్ హీరోలు బుక్ చేసేసుకోవడంతో ఫిబ్రవరి 7 కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రెస్మీట్ ద్వారా వివరించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ సినిమా కథ మున్నిటి గీతాలు.. అనే నవల ఆధారంగా రూపొందుతుందని సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. దీనిపై అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ.. ఈ సినిమా కథని మేము 2020 సంవత్సరంలోనే రెడీ చేశాం. శ్రీకాకుళం లోని మత్స్యకారుల రియల్ లైఫ్ స్టోరీల ఆధారంగా చందు ఈ కథను రాశారు. అయితే 2022లో రచయిత శ్రీనివాసరావు మున్నిటి గీతాలు నవల రాశారు. ఆయనకు వెంటనే నోటీసులు పంపాము. అప్పుడు ఆయన నా కథకి.. మీ కథకి చాలా తేడా ఉంది.
కానీ.. బ్యాక్ డ్రాప్ ఒకటే. పబ్లిక్ డొమైన్ మీద ఇలాంటి కథలు ఎన్నైనా రాసుకోవచ్చు అని మాతో వివరించారు. మేము కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేసామంటూ వివరించాడు. ఇదిలా ఉంటే మున్నిటి గీతాలు నవలకు రైట్స్ ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ క్రిష్ వద్ద ఉన్నాయని.. ఆయన ఈ కథతో వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో ఉండగా.. అల్లు అరఅరవింద్.. క్రిష్ వద్దకు వెళ్లి వాస్తవాలను వివరించి.. ప్రస్తుతానికి వెబ్ సిరీస్ ని ఆపించినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా చిన్న చిన్న మార్పులు చేసి.. ఆ నవల కథతో వెబ్సిరీస్ తీసే ప్లాన్లో క్రిష్ ఉన్నాడట. ఇలా అల్లుఅరవింద్ చేసిన కమెంట్స్ వైరల్ అవ్వడంతో.. ఈ కథ కోసం ఇంతమంది ఆరాట పడుతున్నారంటే.. కచ్చితంగా తండేల్ నాగచైతన్యను మరో లెవెల్ కు తీసుకువెళ్లడం ఖాయమని.. కథలో మంచి కంటెంట్ ఉండి ఉంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.