నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానుల నుంచి టాలీవుడ్ ప్రముఖుల వరకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఈ క్రమంలో మోక్షజ్ఞ డబ్యూ మూవీ పై ఆడియన్స్లో విపరీతమైన హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాకు ఎస్.ఎల్.వి సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పైన నందమూరి తేజస్విని సమర్పణలో సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు.. క్యాస్టింగ్ విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం.
కాగా ఇప్పటికే ఈ సినిమా మహాభారతం బ్యాక్ డ్రాప్తో రూపొందుతూనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టును.. భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారు. ఇందులో భాగంగానే భారీ తారాగణం సినిమాలో నటించనున్నారని సమాచారం. కాగా.. తాజాగా ఈ సినిమాలో మోక్షజ్ఞ తల్లిగా నటించిన అమ్మడు ఎవరనే న్యూస్ నెటింట వైరల్ గా మారింది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీలో మోక్షజ్ఞ తల్లి పాత్ర చాలా కీలకంగా ఉండనుందట. ఇందులో ఓ సీనియర్ హీరోయిన్ నటించబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు.. కల్కి 2898 ఏడి సినిమాతో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చి.. సత్తా చాటుతున్న శోభన.
1980లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అప్పట్లో స్టార్ హీరోయిన్గా రాణించిన శోభన తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. అయితే తాజాగా కల్కి రీ ఎంట్రీతో మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో.. అమ్మడికి ఇప్పుడు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగానే మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కూడా ఆయన తల్లిగా నటించే ఛాన్స్ కొట్టేసిందట. ఇక బాలయ్య కొడుకు సినిమా అనగానే ఆమె కూడా వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక మోక్షజ్ఞ హీరోగా.. ప్రశాంత్ వర్మ త్వరలోనే సినిమా షూట్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే దీని నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. నందమూరి అభిమానులే కాదు.. అన్ని వర్గాల ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే సినిమాలో మోక్షజ్ఞ హీరోయిన్గా నటించినందుకు ఓ బాలీవుడ్ బ్యూటీ సెలెక్ట్ అయినట్లు సమాచారం. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేసి చూడాల్సిందే.