బాలయ్య ఫిగర్ కి హీరో అవుతాడని అనుకోలేదు.. ఆయనది అలాంటి బ్యాచ్.. మాజీ సీఎం షాకింగ్ కామెంట్స్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంద‌కు పైగా సినిమాల్లో నటించిన బాల‌య్య‌ ఇప్పటికీ అదే ఎనర్జీ.. అదే నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. టాలీవుడ్‌ను శాసించే రేంజ్‌కు ఎదుగుతున్న బాలయ్య.. రాజకీయాల్లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో బాలకృష్ణ గురించి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని ఆసక్తికర విషయాలను రివిల్ చేశాడు. ఆయనపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నిజాం కాలేజీలో బాలయ్య నేను ఇద్దరం కలిసి చదువుకున్నామని.. బాలయ్య నాకంటే ఒక సంవత్సరం సీనియర్ అంటూ వివరించాడు. అయితే ఆయన సీనియర్ అయినప్పటికీ.. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉండే వాళ్ళమ‌ని.. బాలయ్యది కూడా మా బ్యాచ్చే.. ఇప్పటికీ మా మధ్యన అదే స్నేహం కొనసాగుతుంది.

File:Nallari Kiran Kumar Reddy (YT thumbnail).png - Wikipedia

ఫ్రెండ్‌షిప్ ఇప్పటికీ అలానే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య ఇండస్ట్రీ విషయాల గురించి మాట్లాడుతూ బాలకృష్ణ సినిమాల్లోకి వస్తాడని గాని.. హీరోగా మారతాడని గాని అసలు ఊహించలేదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఆయనకు ఉన్న ఫిగర్ కి హీరో అవుతాడని అసలు భావించలేదని సంచలన కామెంట్స్ చేశాడు. ఈ విషయాన్ని నవ్వుతూ కిరణ్ ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు. ఇక ఇంటర్వ్యూ చూసిన చాలా మంది కిరణ్ కుమార్ రెడ్డి కావాలనే సెటైరికల్‌గా బాలయ్య ను ఉద్దేశించి అలాంటి కామెంట్స్ చేశాడంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య అసలు సీరియస్ గానే ఉండేవారు కాదని.. నటన పట్ల సీరియస్ నెస్ కూడా ఎప్పుడు కనిపించలేదని.. సరదాగా.. జోవియల్‌గా నవ్వుతూ.. నవ్విస్తూ కనిపించే వ్యక్తి .. ఎంజాయ్ ప‌ర్స‌న్ అంటూ చెప్పుకొచ్చాడు.

Balakrishna to write a book on NTR - TeluguBulletin.com

కెరీర్ పరంగా అసలు సీరియస్ గా ఉండేవాడు కాదంటూ వివరించాడు. అయితే మేమిద్దరం ఎప్పటికీ మంచి స్నేహితులమే.. అప్పటి రోజులను కలిసినప్పుడల్లా గుర్తు చేసుకుంటూనే ఉంటాం.. మా స్నేహం ఎప్పటికీ ఇలానే కంటిన్యూ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరపున 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాత్ మరణంతో రోశయ్య తాతకాలిక సీఎంగా కొనసాగారు. తర్వాత ఆయన రాజీనామా చేయడం అదే ప్లేస్ లోకి కిరణ్ కుమారి సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇక రాష్ట్ర విభజన ముందు వరకు సీఎం గా కొనసాగిన కిరణ్ కుమార్.. తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.