పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎలాంటి రకమైన వార్తలు వైరల్ గా మారాయి మనం చూస్తున్నాం . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆయన కోసం మెగా ఫ్యామిలీ అంతా కదిలి రావడం పలువురు స్టార్స్ కూడా ఆయనకు సపోర్ట్ చేయడం.. ఆ తర్వాత భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం . ఎప్పుడు లేని రేంజ్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని బ్లాస్ట్ చేసేస్తున్నారు . పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వీడియోలను ఎలా ట్రెండ్ చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం.
74 వేల ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తన అపోజిషన్ లీడర్ వంగా గీతాపై గెలవడం సంచలనంగా మారింది . అయితే పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఎలా విరుచుకుపడ్డారో.. ఆయనను పర్సనల్ గా ఎలా అటాక్ చేసి దారుణంగా మాట్లాడారో అందరికీ తెలిసిందే ..పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నాలెజినోవో గురించి వాళ్ళ ఇంటి పని వాళ్ళ గురించి చాలా నీచాతి నీచంగా కామెంట్స్ చేశారు . అయితే పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్ గా వాటికి ఆన్సర్ ఇస్తూ వచ్చారు.
పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వాళ్ళకి తగిన రేంజ్ లో బుద్ధి చెప్తాడు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భావించారు. అయితే నిన్న విన్నింగ్ స్పీచ్ లో పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా వైసీపీకి నెగిటివ్గా మాట్లాడలేదు. చాలా పాజిటివ్ గానే మాట్లాడుతూ వచ్చారు . అంతేకాదు పవన్ కళ్యాణ్ వాళ్లపై కక్ష తీర్చుకుంటారు. పగ తీర్చుకుంటారు అనుకున్న అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండిపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు . అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు వైసిపి వాళ్ళు అన్ని మాట్లాడిన సైలెంట్ గా ఉన్నారు ..నిదానమే ప్రధానమనుకున్నాడా..? లేకపోతే ఆయన మనసులో వేరే ఉద్దేశం ఏదైనా ఉందా..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!